శ్రీశైలం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి తల బయటకు పెట్టింది. ఇదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.







