రోడ్డు ప్రమాదాలపై యువత అవగాహన పెంచుకోవాలి

UPDATED 28th DECEMBER 2017 THURSDAY 7:00 PM

పెద్దాపురం: రోడ్డు ప్రమాదాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన లెర్నర్స్ లైసెన్స్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భగా మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ కె. పద్మాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవీన్ కుమార్ మాట్లాడుతూ యువత మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాక ఎదుటి ప్రయాణికుల కుటుంబాల్లో విషాదం నింపుతున్నారన్నారు. వాహనం నడిపేటప్పుడు లైసెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ పద్మాకర్ మాట్లాడుతూ లైసెన్సు లేకుండా టూ వీలర్ నడిపితే రూ.1000, ఫోర్ వీలర్ నడిపితే రూ.2000 అపరాధరుసుము వసూలు చేస్తామన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మేళాలో సుమారు 150 మందికి ఎల్.ఎల్.ఆర్ లు జారీచేశామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏ.వో. సందీప్, ఈవో జెన్నిబాబు, రవాణా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us