UPDATED 25th AUGUST 2021 THURSDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : వ్యవసాయ, ఉద్యాన, పశువైద్యం డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూర్ ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ. సీతారామశర్మ, డాక్టర్ ఇంజేటీ సుధీర్కుమార్ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ప్రవేశాలకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్సైట్లో ఈ నెల 19 నుంచి 28 వరకూ ధరఖాస్తులు స్వీకరించనున్నట్టు వారు చెప్పారు.







