UPDATED 16th MARCH 2022 WEDNESDAY 09:00 AM
Half-Day Schools : ఆంధ్రప్రదేశ్లో మే మొదటి వారం నుంచి విద్యా సంస్ధలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మే లో పదో తరగతి పరీక్షలు ఉన్నందువల్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉన్నందువల్ల ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటించనుంది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
పరీక్షలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందువల్ల సెలవులు జూన్ నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు తక్కువగా ఉన్నందువల్ల విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది.ప్రతి ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు తిరుగు తెరుస్తారు.
కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు మూడో వారం నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. దీంతో పని దినాలు తగ్గాయి. కొన్ని సెలవు దినాలలో కూడా పాఠశాలలు పని చేశాయి. ఏడాదిలో కనీసం 180 పనిదినాలు ఉండేలా విద్యా కాలెండర్ని సర్దుబాటు చేశారు.







