UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 02:20 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): 15వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఆఫ్లైన్లో రోజుకు 10వేలు చొప్పున భక్తులకు కేటాయించనున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉదయస్తమాన సేవా టిక్కెట్ల బుకింగ్కు ప్రత్యేక యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా భక్తులు ఆన్లైన్లో ఉదయస్తమాన సేవా టిక్కెట్టును సైతం బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిపై ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు.







