రెడ్ బీ న్యూస్:
సూపర్స్టార్ మహేష్ బాబు కెరీర్లో మరపురాని చిత్రం `ఒక్కడు`. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా `డర్టీ హరి` చిత్రాన్ని తెరకెక్కించిన ఎమ్మెస్ రాజు `ఒక్కడు` సీక్వెల్ గురించి స్పందించారు.
తాజాగా ట్విటర్ ద్వారా అభిమానులతో టచ్లోకి వచ్చిన ఎమ్మెస్ రాజు.. `ఒక్కడు` సీక్వెల్ గురించి వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. త్వరలోనే తాను మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. ఒకవేళ తను `ఒక్కడు-2` తీస్తే దానికి గుణశేఖరే దర్శకత్వం వహిస్తారని చెప్పారు. వచ్చే నెలలో పూర్తి వివరాలు వెల్లడి చేయబోతున్నట్టు తెలిపారు.







