UPDATED 16th JULY 2022 SATURDAY 07:50 PM
Pawan kalyan: జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో తాము ఏయే పనులు చేస్తామో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరించి చెప్పారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థిని బాగు చేస్తామని అన్నారు. ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకోసం పనిచేస్తామని అన్నారు.
తాము అధికారంలో లేకపోయినప్పటికీ కౌలు రైతులకు సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు.ఎన్నికల సమయంలో జనసేన పూర్తి ప్రణాళికను వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల్లో యువత ఎవరి పక్షం ఉంటారో నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.
కులాల స్థాయిని దాటి ప్రజలు ఆలోచించాలని ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తమ పార్టీ మార్పు కోసమే వచ్చిందని చెప్పారు.







