UPDATED 29th AUGUST 2022 MONDAY 06:16 PM
Industry Boiler Explosion Two Killed : కాకినాడలోని వాకలపూడి ప్యారి షుగర్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిషనరీ ఎక్విప్ మెంట్ సెక్షన్ లో ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు.అయితే ఈనెల 19న ఇదే ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యయి.
వరుస ప్రమాదాలపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వారు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గా గుర్తించారు.







