Varla Ramayya: కడప కేంద్ర కారగార జైలర్ పి.వరుణారెడ్డిని బదిలీ చేయండి: వర్ల రామయ్య

UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 09:00 AM

అమరావతిమాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ప్రాణహాని ఉందని, ప్రస్తుతం కడప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. కడప కేంద్ర కారగార జైలర్ పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని కోరుతూ వర్ల రామయ్య లేఖ రాయడం సంచలనంగా మారింది. సీబీఐ డైరెక్టర్ కు వర్ల రామయ్య రాసిన లేఖ ప్రకారం.. వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించే దృష్ట్యా.. నిందితులను కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మార్చాలని, కుదరని పక్షంలో కడప కారాగారం జైలరుగా ఉన్న వరుణారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలనీ.. వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us