UPDATED 13TH MAY 2017 SATURDAY 2:00 PM
రాజమండ్రి: రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూకబ్జాలు, గంజాయి అక్రమ రవాణాను అరికడతామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల బదిలీల్లో పైరవీలకు ఆస్కారం లేదన్నారు.







