UPDATED 3rd SEPTEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం గ్రామంలో రావిచెట్టు వీధిలో ఉన్న శ్రీకృష్ణమందిరంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయానికి మండపం నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, అలాగే పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.







