WEATHER UPDATE : రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ!

UPDATED 6th JUNE 2026 2:00 PM

అమరావతి, రెడ్ బీ న్యూస్, జూన్ 6:  రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండతీవ్రతతో అల్లాడుతున్న ఏపీలోకి ఎట్టకేలకు రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాన్ని తాకాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

​ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో ప్రవేశించిన ఈ రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, రాబోయే కొన్ని రోజుల్లోనే ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల రాగల కొన్ని రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గత ఏడాదితో పోలిస్తే.. గత ఏడాది (మే 26న) కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈసారి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుత గమనాన్ని బట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా సకాలంలోనే వర్షాలు కురిసేలా వాతావరణం అనుకూలించిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాల రాకతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us