హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాది విడిది ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు దక్షిణాది విడిది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోలను ఈ మేరకు సీఎస్ ఆదేశించారు.







