విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.







