UPDATED 1st JULY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, తదితర ప్రాంతాల్లో బ్యాగ్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను ఆదివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. మూడు లక్షలు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విరవాడ గ్రామానికి చెందిన అంబటి కోటమ్మ, నాగులూరి లక్ష్మిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెద్దాపురం సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







