హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్గా గజ్జెల నగేశ్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్గా జూలూరి గౌరీశంకర్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్లను కేసీఆర్ నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఇటీవలే మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఛైర్మన్గా, తెరాస సామాజిక విభాగం నేత మన్నె క్రిశాంక్ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) ఛైర్మన్గా, తెరాస ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్(సాయిచందర్)ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.







