ఘనంగా నూకాలమ్మ అమ్మవారి బద్దికడుగు ఉత్సవం
కాండ్రకోట( పెద్దాపురం) : కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో బద్ది కడుగు ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి నైవేద్యంగా నవధాన్యాలను సమర్పించి ఉగాది రోజున అమ్మవారి తలుపులు మూసివేసి తిరిగి గురువారం పూజలు నిర్వహించి, అనంతరం బద్దికడుగు ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మి, ఎలిశెట్టి నాని, ఈవో వివి పల్లంరాజు,గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచె గాంధీ, ఉపసర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.







