చెన్నై (రెడ్ బెడ్ న్యూస్) 9 జనవరి 2022: తమిళనాడులో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. అక్కడ నమోదవుతున్న కేసుల్లో 80-85 శాతం మంది నమూనాల్లో ‘ఎస్’ జన్యువు తగ్గుదల కనిపిస్తోంది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని సూచిస్తోంది. మిగతా 15-20 మందిలో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.







