తిరుమల (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.







