అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021 : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఈ మధ్యాహ్నం ధర్మాసనం వాదనలు విననుంది.







