ఘనంగా పుచ్చలపల్లి వర్ధంతి

UPDATED 19TH MAY 2017 FRIDAY 5:00 PM

పెద్దాపురం: స్థానిక వరహాలయ్య పేటలో యాస‌ల‌పు సూర్యారావు భ‌వ‌నంలో ద‌క్షిణ భార‌త క‌మ్యూనిస్టు ఉద్య‌మ నిర్మాత పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య వ‌ర్థంతి స‌భ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. వేణుగోపాల్, సిపిఎం పట్టణ కార్య‌ద‌ర్శి నీల‌పాల సూరిబాబు, నాయ‌కురాలు ఎం వీర‌ల‌క్ష్మి త‌దిత‌రులు హాజరై మాట్లాడుతూ సుందరయ్య చూపిన బాటలో ఆయన స్పూర్తితో ముందుకు సాగలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆయన  చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘన నివాళుల‌ర్పించారు. అనంతరం ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారులు గీతాల‌తో సుంద‌ర‌య్య‌కు నివాళుల‌ర్పించారు. సుంద‌ర‌య్య త్యాగాల బాట‌లో ప‌య‌నించి, క‌మ్యూనిస్టు ఉద్య‌మ బలోపేతానికి పాటుప‌డాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, దారపురెడ్డి కృష్ణ, రాజు, కంచుమర్తి కాటంరాజు, మహాపాతిన రాంబాబు, కె.నాగు, సిరిపురపు శ్రీనివాస్, మరిడయ్య, దాడి బేబి , అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us