హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీ హెలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కోవాగ్జిన్, 27 కొవిషీల్డ్ వయల్స్ ను చోరీ చేశారు. అంతేకాదు, మూడు కంప్యూటర్లను కూడా ఎత్తు కెళ్లారు. చోరీ గురైన వయతో 340 కొవిషీల్డ్ డోసులు, 270 కొవాగ్జిన్ డోసులు ఇవ్వవచ్చు. చోరీ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.







