గాంధీనగర్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: గుజరాత్ తీరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మాదకద్రవ్యాలను పట్టుకున్నాయి. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలో హెరాయిన్ను తరలిస్తుండగా గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.







