తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగసభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో అమరావతి ఐకాస, తెదేపా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబుకు డిప్యూటీ ఈవో లోకనాథం, ఓఎస్డీ రామకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. కాసేపట్లో తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన సభ వద్దకు చేరుకోనున్నారు.







