UPDATED 30th MAY 2017 TUESDAY 11:00 PM
తొండంగి : యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులు నిరుద్యోగులకు వరమని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. తాము చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది. ఏ చదువు చదవాలి, ఏ చదువుకు ఏ ఉద్యోగం వస్తుందనే విషయాలు ఇలాంటి శిక్షణ తరగతుల వల్ల తెలుస్తాయని, తరగతులకు ఇంతమంది హాజరవ్వడం స్ఫూర్తిదాయకమని , మీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం యనమల ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు సేవలు అందిస్తున్నామని ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు శివరామకృష్ణన్ తెలిపారు.







