Updated 12th February 2023 Sunday 10:20 am
AP New Governor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్గాఉన్న బిస్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్లో ఒకరు.
కొత్త గవర్నర్లు వీరే..
1. అరుణాచల్ ప్రదేశ్ – లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్.
2. సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
3. జార్ఖండ్ – సీపీ రాధాకృష్ణన్
4. హిమాచల్ ప్రదేశ్ – శివ్ ప్రతాప్ శుక్లా
5. అసోం – గులాబ్ చంద్ కటారియా
6,. ఆంధ్రప్రదేశ్ – రిటైర్డ్ జస్టీస్ ఎస్. అబ్దుల్ నజీర్
7. ఛత్తీస్గడ్ – బిస్వభూషణ్ హరిచందన్
8. మణిపూర్ – అనసూయ
9. నాగాలాండ్ – గణేషన్
10. మేఘాలయా – ఫగు చౌహాన్
11. బీహార్ – రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
12. మహారాష్ట్ర – రమేశ్ బైస్
13. లడఖ్ – బీడీ మిశ్రా







