Updated 19th December 2022 Monday 8:40 pm
Tirumala Srivari Sarvadarshan : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులకు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది. నిన్న 75 వేల 6 వందల 11 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చింది.







