శ్రీహరిపురం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: విశాఖ జిల్లా గొల్లలపాలెంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో భార్య మాధవిని చంపిన భర్త శివ నాగేశ్వరరరావు.. అనంతరం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు.







