అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకునందమూరి తారక రామారావు ప్రతీక అని టీడీపీ అధినేతచంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం పని చేస్తోందని పేర్కొన్నారు. కథానాయకునిగా, మహా నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు.







