Updated 30 January 2022 Sunday 09:00 PM
కడప (రెడ్ బీ న్యూస్): రైల్వేకోడూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు. కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.







