Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన ఆ సాంగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. కళావతి అంటూ సాగే ఈ పాట ప్రోమో అభిమానుల్ని మెప్పించింది. అయితే సాంగ్ రిలీజ్ అయ్యే లోపే బయటకి లీక్ అయింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి మరో తల నొప్పి ఎదురయ్యింది. దీనిపై మహేష్ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.
ఈ సాంగ్ ముందే లీక్ అవ్వడంతో ‘సర్కారు వారి పాట’ సినిమా సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తమన్ దీనిపై మాట్లాడుతూ ఓ వాయిస్ మెసేజ్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.తమన్ ఈ పాట లీక్ పై స్పందిస్తూ.. ”మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం.
రాత్రి, పగలు పని చేశాం. లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ రికార్డింగ్ కి పని చేసిన వాళ్ళు, డైరెక్టర్, నిర్మాత దీనికోసం పెట్టిన డబ్బులు.. ఇలా చాలా.. మా అందరి కష్టం ఈ సాంగ్. ఈ పాట రికార్డింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అబిమానం అంతా ఈ పాటలో చూపించాము. అద్బుతమైన లిరిక్స్ వచ్చాయి. మా డైరెక్టర్ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ లిరికల్ వీడియోని తయారు చేశారు. మేం ఎంతో హ్యాపీగా ఈ పాట కోసం వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్, మాస్టరింగ్, మిక్సింగ్ టెక్నాలజీ వాడాం.







