UPDATED 13th JUNE 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: అనపర్తి నుంచి సామర్లకోట వైపు వెళ్లే రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు బుధవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని, శరీరమంతా బలమైన గాయాలు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.







