చింతూరు (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: వై.రామవరం మండలంలో సింధువాడ, బురదకోటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. పది ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారనే సమాచారంతో పోలీసులు, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. దీని విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా. సెబ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆనంద్, సీఐ యువకుమార్ తదితరులు పాల్గొన్నారు.







