UPDATED 30th NOVEMBER 2022 12:15 PM
JC prabhakar Reddy.. ED : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభాకరెడ్డికి చెందిన రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
అంతేకాదు గోపాల్ రెడ్డికి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇద్దరివీ కలిపి 22.10 విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.కాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోను, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి నివాసంలోను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఎస్- 4 వాహనాలను రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయించిన కేసులో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సోదాలు జరిపిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జేసీ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.







