అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై సంచయిత గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఛైర్మన్గా అశోక్గజపతిరాజు పునఃనియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతలంలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సంచయిత డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.







