Updated 5th May 2017 Friday 10:00 PM
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ వాహనాలపై ఎర్రబుగ్గల వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంబులెన్సులు, పోలీసు వాహనాలు మినహా, ఇతర వాహనాలకు ఎర్రబుగ్గలు ఉండరాదని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర నిర్ణయం మేరకు అమలు చేస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలని కేంద్రం వాహనాలపై ఎర్రబుగ్గల వినియోగాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మే 1నుంచి అమలులోకి వచ్చింది.







