Mobile: ఆన్‌లైన్‌ క్లాసు మధ్యలో పేలిన ఫోన్‌

రెడ్ బీ న్యూస్, 18 డిసెంబర్ 2021: ఆన్‌లైను క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోను పేలింది. 15 ఏళ్ల ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చంద్‌ కుయియా గ్రామానికి చెందిన రాం ప్రకాశ్‌ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోనులో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా చేతిలోని ఫోను పేలడంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us