UPDATED 6 FEBRUARY 2022 SUNDAY 12:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియావేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా లత మృతిపట్లు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్య ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని జగన్ ట్వీట్ చేశారు.







