పెదబ్రహ్మదేవంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

UPDATED 18th JUNE 2018 MONDAY 7:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారద రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. ఎఐఎంఐఎల్ ఫార్మాసిటికల్స్ ఇండియా సంస్థ సౌజన్యంతో, స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ నీరజ నేతృత్వంలో ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు సమితి సభ్యులు, మాజీ కార్యదర్శి పెంటపాటి మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నీరజ మాట్లాడుతూ మన జిల్లాలోనే పేరెన్నికగన్న ఆయుర్వేద ఆసుపత్రులలో పెదబ్రహ్మదేవం డిస్పెన్సరీ ఒకటని, ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు మందులు లభిస్తున్నాయని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఆయుర్వేదంలో ఉన్నాయని, వీటిపై స్వచ్చంద సంస్థలు ప్రజలలో అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ శిబిరంలో సుమారు 200మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధం, సభ్యులు నువ్వుల హరనాధరావు, నువ్వుల బాబ్జి, మండవిల్లి శ్రీనివాస్, తోటకూర సూర్య ప్రభాకర్, తెలుగుంట్ల నరసింహారావు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us