విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: శుక్రవారం సాయంత్రం విశాఖ నగరంలో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఏడీ కూడలిలో రూ.150 కోట్లతో నిర్మించిన పైవంతెనను సీఎం ప్రారంభించారు. అనంతరం విశాఖ బీచ్రోడ్లో ఏర్పాటు చేసిన జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్కును ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ నెక్కెల నాయుడుబాబు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. ఆతర్వాత వైజాగ్ కన్వెన్షన్లో నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక, రవితేజ పెళ్లి విందుకు విందుకు హాజరయ్యారు. కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు.







