UPDATED 20th MAY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేట సెంటర్ లో వాక్ విత్ చర్చి ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగుళూరుకు చెందిన ఆండ్రూస్ బాబు, కార్తీక సాయిజ్ఞ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సిబిసి క్లాసులు నిర్వహించి, పోటీలు ఏర్పాటుచేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం చర్చి అభివృద్ధికి రూ. నాలుగు లక్షలు అందచేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ పి. ఆనందబాబు, కేర్ ఫర్ నీడ్ డైరెక్టర్ పి. జెమియా, సంఘ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.







