ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం కార్తిక ఆదివారం కావడంతో భక్తజనంతో శోభిల్లింది. స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మముడులు, కంకణధారణ, సూత్ర, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు, అష్టోత్తర పూజలు, బాలభోగం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు రమణీయంగా జరిపించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.







