గవర్నర్‌ విందులో తొలిసారి పవన్‌

UPDATED 15th AUGUST 2017 TUESDAY 6:00 PM

హైదరాబాద్‌: 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన ఎట్‌హోంగా పిలిచే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ విందుకు హాజరు కావాలని గవర్నర్‌  పవన్‌ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేనీటి విందుకు పవన్‌ తొలిసారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ప్రముఖులందరినీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ విందుకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్ర‌బాబు నాయుడు, కె. చంద్ర శేఖరరావు, కేంద్ర‌మంత్రులు బండారు ద‌త్తాత్రేయ‌, సుజ‌నా చౌద‌రి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us