REDBEENEWS :
ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు Omicron సోకినవారిలో కొంతమందికి కంటి సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా.. విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లో కనిపిస్తున్న లక్షణాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ రోగట కంటికి సంబంధించిన సమస్యల గురించి చెప్పింది. ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కరోనా సోకిన రోగులలో కళ్లు ఎర్రబడడం, చూపు తగ్గడం, కంటిలోని తెల్లటి భాగం మరియు కనురెప్పల పొర వాపు, అంటే కండ్లకలక వంటి లక్షణాలు కనిపిస్తాయని నివేదికలో చెప్పబడింది.
ఒమిక్రాన్ లక్షణాలు:
1- కళ్లు ఎర్రగా మారడం
2- కళ్లలో చికాకు సమస్య
3- కళ్లలో నొప్పి
4- కళ్లలో చూపు మసకబారడం
5- కళ్లలో కాంతి సున్నితత్వం
6- ఎక్కువగా నీరు కారడం
7- కనురెప్పల పొరలు వాపు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్లో కళ్ళకు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తాయి. కరోనా సోకిన రోగుల 5 శాతం మంది కండ్లకలక బాధితులు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, కంటికి సంబంధించిన ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన కరోనా అని నిర్దారించుకోవద్దు.. కచ్చితంగా టెస్టింగ్ ద్వారా మాత్రమే వ్యాధిని గుర్తించండి.







