UPDATED 3rd NOVEMBER 2022 THURSDAY 1:10 PM
AP High Court: విశాఖపట్టణంలోని రుషికొండ తవ్వకాల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. రుషికొండ తవ్వకాల్లో భాగంగా మూడు ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించింది. అయితే మూడు కాదు 20ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.







