రావులపాలెం (రెడ్ బీ న్యూస్) 19 నవంబర్ 2021: కార్తిక మాసం సందర్భంగా రావులపాలెంలోని కొత్త కాలనీలోని శ్రీపెద్దింట్లమ్మ వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఐస్ శివలింగం ఆకట్టుకుంది. స్థానికులు ఐస్ పెట్టెలను తీసుకుని వచ్చి శివలింగం ఆకారంలో తీర్చిదిద్ది పువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను గీసి చుట్టూ ప్రమిదలను పెట్టి వెలిగించారు.







