శబరిమల (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నూలులోని బుధవారపేటకు చెందిన ఇద్దరు భక్తులు దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను బుధవారపేట, దేవనగర్కు చెందిన ఆదినారాయణ, శంకర్గా గుర్తించారు. అయ్యప్ప సన్నిధికి టెంపో వాహనంలో వెళ్తుండగా శబరిమలకు 60 కి.మీల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.







