UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 2:40 PM
Telangana : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలతో విరుచుకుపడే కేటీఆర్ ఈ సారి ‘జుమ్లా..హమ్లా’అంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు అయితే జుమ్లా..లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మీడియా ఇన్ తెలంగాణ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మీడియాలో పాజిటివ్ వార్తలు కంటే నెగిటివ్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయని..సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన జర్నలిజం ఇటువంటి పోకడలు సరికాదని సూచించారు.







